byసూర్య | Fri, May 13, 2022, 09:00 PM
తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం 'బుద్ధవనం' శనివారం ప్రారంభం కానుంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్, విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్ గౌడ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ఇది బౌద్ధులకు ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించబడిన థీమ్ పార్క్. ఇది నాగార్జన సాగర్ వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్మించబడింది. శనివారం బుద్ధవనాన్ని కేటీఆర్ జాతికి అంకితం చేయనున్నారు. దీంతో పర్యాటకులను మరింతగా ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 100 కోట్ల రూపాయలతో నిర్మించిన బుద్ధవనం ఆసియాలోనే అతిపెద్ద బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం.