byసూర్య | Fri, May 13, 2022, 06:31 PM
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం మరియు ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ శనివారంతో ముగియనుంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తెలంగాణకు రానున్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరైన సంగతి తెలిసిందే.
తాజాగా రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను కూడా బండి సంజయ్ శనివారం ముగించనున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.