byసూర్య | Fri, May 13, 2022, 04:08 PM
మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర ఓ అర్ అర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా…మరో 18 మంది గాయపడ్డారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అర్ అర్ పై తెల్లవారుజామున 5గంటల సమయంలో ఘట్కేసర్ వైపు నుండి కీసర వైపు వస్తున్న పెండ్లి బృందం వాహనం. తుఫాను వాహనం ప్రమాదానికి గురైంది. డ్రైవర్ రామచందర్ కు మూర్ఛ రావడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది కి గాయాలు , ఒకరు మహిళ మృతి చెందింది. గాయాలైన వారిలో నూతన వదువరులు ఉన్నారు. మంగళగిరిలో పెండ్లి చేసుకొని తిరుగు ప్రయాణం జిడిమెట్ల కి వస్తుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. గాయాలైన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.