శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి తలసాని

byసూర్య | Fri, May 13, 2022, 03:57 PM

వేసవి సెలవులలో ఉన్న విద్యార్ధుల కోసం జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా శిభిరాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ ఎస్పి రోడ్ లోని గురుమూర్తి స్విమ్మింగ్ పూల్ లో వేసవి శిభిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులలో విద్యార్ధులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా వేసవి శిభిరాలలో చేరి ఆసక్తి కలిగిన వివిధ క్రీడలలో శిక్షణ పొందాలని పిలుపునిచ్చారు. నెలరోజులపాటు నిర్వహించే ఈ శిభిరాలలో అనుభవజ్ఞులైన కోచ్ లతో విద్యార్ధులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, స్పోర్ట్స్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM