తెలంగాణ శాసనసభను సందర్శించిన ఛత్తీస్ ఘడ్ శాసన సభాపతి
byసూర్య |
Fri, May 13, 2022, 03:42 PM
తెలంగాణ రాష్ట్ర శాసనసభను శుక్రవారం చత్తీస్ఘడ్ రాష్ట్ర శాసనసభాపతి డా. చరణ్దాస్ మహంతి సందర్శించారు. అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన మహంతకి తెలంగాణ అసెంబ్లీలో శాలువా, పుష్పగుచ్ఛంతో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహ చార్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహంతికి శాసనసభ సమావేశ మందిరాన్ని స్పీకర్ పోచారం దగ్గరుండి చూపించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర శాసనసభ తరుపున జ్ఞాపికను బహుకరించారు.
Latest News