byసూర్య | Fri, May 13, 2022, 02:50 PM
తెలంగాణలో జరగనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించనున్నారు. సమీక్షా సమావేశానికి మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల కలెక్టర్లు, డిప్యూటీలు, అటవీశాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.