అమిత్ షా పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి

byసూర్య | Fri, May 13, 2022, 02:09 PM

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నందున శుక్రవారం సభాస్థలిని అక్కడి ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ లో రేపు సాయంత్రం బహిరంగ సభ జరగనుంది. ఈ బహిరంగ సభ కోసం భారీ స్థాయిలో జనసమీకరణ కోసం బిజెపి కసరత్తులు చేస్తుంది. ఈ నేపథ్యంలో సభాస్థలి ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందర్శించి పలు సూచనలు చేశారు. కేంద్ర మంత్రితో పాటు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి తదితరులు సభాస్థలిని పరిశీలించిన వారిలో ఉన్నారు.

Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM