byసూర్య | Fri, May 13, 2022, 02:07 PM
రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన హన్మాండ్లు (45) అక్బర్ నగర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మోస్రా తహసీల్ కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వర్తిస్తున్న హన్మాండ్లు రోజూలాగే గురువారం విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా అక్బర్ నగర్ వద్ద డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలు కావడంతో హన్మాండ్లును జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తలించారు. హన్మాండ్లు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.