byసూర్య | Wed, Jan 19, 2022, 06:42 PM
కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. రైతుల చావులకు సమాధానం చెప్పాలని ఆమె ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు రైతులు చనిపోతున్నా కేసీఆర్ కు పట్టడం లేదని షర్మిల మండిపడ్డారు.దొరా మీరిచ్చే హామీలకే దిక్కులేనప్పుడు, మీరు సాయం చేస్తారన్న ఆశ లేదు, పత్తికి, మిరపకు తెగులు సోకి, పెట్టిన పెట్టుబడి రాక, పంటను కాపాడలేని పురుగుల మందే మమ్మల్ని అప్పుల నుంచి కాపాడుతుందని,రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు చనిపోతున్నాదున్నపోతు మీద వాన పడ్డట్టు కేసీఆర్ గారు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. రైతులకు భరోసా కల్పించేందుకు దొర గారు కాలు బయటపెట్టింది లేదు.అయ్యా దొర గారు,పంజాబ్ రైతుల చావులు మీకు కనపడ్డాయి కానీ రాష్ట్రంలో రైతుల చావులు కనపడటం లేదా? రైతుల చావులను ఆపడం చేతకానిముఖ్యమంత్రిమనకొద్దు అంటూ షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.