byసూర్య | Wed, Jan 19, 2022, 05:57 PM
కరీంనగర్ జిల్లా లోని గంగాధర మండలం రంగారావుపల్లెలో భూ సర్వే ఆపేయాలంటూ రైతుల ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం మూడో టీఎంసీకి భూములివ్వబోమని రైతులు తేల్చిచెప్పారు. భూ సర్వే చేసేందుకు వచ్చిన అధికారులు వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. భూ సర్వే చేసేందుకు రైతులు సహకరించాలని తహసీల్దార్ కోరారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. భూసర్వే చేసేందుకు రైతులు సుముఖంగా లేరంటూ కాంగ్రెస్ నేతలు రైతులతో కలిసి పొలాల్లో బైఠాయించారు.