byసూర్య | Wed, Jan 19, 2022, 05:49 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల బదిలీ, పదవుల కేటాయింపుల్లో సీనియారిటీ జాబితా ఎక్కడా లేదు అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. 317 జీవోను వెంటనే రద్దు చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాల కూర్పు, ఉపాధ్యాయుల కేటాయింపులు గందరగోళంగా ఉన్నాయని విమర్శించారు. ఉపాధ్యాయుల కేటాయింపుల్లో శాస్త్రీయత లేదన్నారు. సీనియారిటీ జాబితా ఎక్కడా ప్రదర్శించబడలేదు. తెలంగాణ ప్రభుత్వం తప్పుడు జీవో తెచ్చిందని ఆరోపించారు,ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు.