byసూర్య | Wed, Jan 19, 2022, 12:15 PM
విధులు నిర్వర్తించకున్నా జీతాలు చెల్లించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న పదుల సంఖ్యలో ఉద్యోగులను నెలల తరబడి పోస్టింగ్ లు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ సీఎస్ పై కౌంటర్ వేసినా ప్రజాహిత వ్యాజ్యం వేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 14లోగా కౌంటర్ దాఖలు చేయాలని లేదా సీఎస్ వ్యక్తిగతంగా హాజరుకావాలని ధర్మాసనం పేర్కొంది. రెవెన్యూ, కమర్షియల్, ట్యాక్స్, ఎక్సైజ్ శాఖల్లో సుమారు 40 నుంచి 50 మంది అధికారులకు నెలల తరబడి పోస్టింగ్లు ఇవ్వడం లేదని, విధులు నిర్వహించకుండా వేతనాలు ఇస్తున్నారని మాజీ ఉద్యోగి బి.నాగధరసింగ్ వ్యాజ్యం దాఖలు చేశారు.