byసూర్య | Wed, Jan 19, 2022, 11:53 AM
సంక్రాంతి పండగకి ప్రజలు ప్రయాణాలు చెయ్యడానికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు రెండు కూడా తన దైన శైలిలో ప్లాన్ చేసుకున్నారు. ఐతే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధర పెంచడం , అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం తగ్గించడం కూడా చూసాము. అందులో మరల 4000 కి పైగా అదనపు బస్సులు నడపడటం కూడా చూసాము. ఈ విధంగా చెయ్యడం వలన తెలంగాణాలో ఆర్టీసీ కి మంచి ఆదాయం వచ్చినట్లు ఎండీ V.C. సజ్జనార్ తెలుపుతూ "సంక్రాంతి సందర్భంగా TSRTC ప్రజల సౌకర్యార్థమై షెడ్యూల్ బస్సులతోపాటు 4 వేల బస్సులను అదనంగా నడిపించింది,దాదాపుగా 55 లక్షల మంది ప్రయాణీకులను ఎలాంటి అధనపు ఛార్జీలు లేకుండా ప్రజా సేవయే లక్ష్యంగా వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడం జరిగింది TSRTC ThankPassengers" అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియ చేసారు.