పేకాటరాయుళ్ల అరెస్ట్

byసూర్య | Wed, Jan 19, 2022, 10:14 AM

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. వివరాల్లోకి వెళితే. పట్టణంలోని రెడ్డి కాలనీలో చీర్ల రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో రహస్యంగా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా మేడా రాజేశ్వర్ రెడ్డి, పోటు మాధవరెడ్డి, చర్ల సమ్మిరెడ్డి, గుగులోత్ లక్ష్మణ్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 22, 100 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM