byసూర్య | Wed, Jan 19, 2022, 08:07 AM
సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మరోసారి విరుచుకుపడ్డారు. కేబినెట్ సమావేశాన్ని టైమ్ పాస్ కోసమే పిలిచారని, 317 జీవోపై కేబినెట్ లో చర్చించకపోవడం దుర్మార్గమని ఆరోపించారు. ఉద్యోగులు చనిపోవాలని కేసీఆర్ కోరుకుంటున్నారని విమర్శించారు. 317 జీవోను సవరించే వరకు వదిలిపెట్టేది లేదని, మానవత్వం లేని మనిషి అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.