byసూర్య | Wed, Jan 19, 2022, 07:42 AM
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పెన్షనర్లకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్లో ఉన్న మూడు డీఏల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం మేరకు ఈ మూడింటికి 10.01 శాతం చెల్లింపులకు ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. త్వరలో ఉత్తర్వులు జారీ చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. పెరిగిన DNA ఫిబ్రవరి జీతం / పెన్షన్తో పాటు చెల్లించబడుతుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై నెలకు రూ.260 కోట్ల అదనపు భారం పడనుంది. పెండింగ్లో ఉన్న డీఏలు మంజూరు చేయడం పట్ల కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.