byసూర్య | Wed, Jan 19, 2022, 07:40 AM
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన శశాంక్ చౌదరి(30) సాఫ్ట్వేర్ ఉద్యోగి. మియాపూర్లోని మయూరి నగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొద్ది రోజులుగా పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో పెళ్లి గురించి చర్చించారు. సోమవారం తెల్లవారుజామున తల్లి పడకగదికి వెళ్లి చూడగా ఉరి వేసుకుని కనిపించాడు. తన డైరీలో ఆరోగ్యం బాగాలేక చనిపోతున్నట్లు రాసి ఉందని పోలీసులు తెలిపారు. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.