కరోనా టెస్టులు పెంచాలంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ
byసూర్య |
Wed, Jan 19, 2022, 07:32 AM
దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య తగ్గడంపై కేంద్రం మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే టెస్టుల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మహమ్మారిని సమర్థంగా ట్రాక్ చేసేందుకు, తద్వారా సరైన జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు. కేసులను ముందస్తుగా గుర్తించడం ముఖ్యమని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహుజా. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. 'ఐసీఎంఆర్ పోర్టల్ డేటా ప్రకారం అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరీక్షలు తగ్గినట్లు కనిపిస్తోంది. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో టెస్టుల పెంపుపై తక్షణమే దృష్టిసారించాలి. కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముమ్మరంగా పరీక్షలు నిర్వహించాలి' అని అందులో పేర్కొన్నారు.
Latest News