byసూర్య | Tue, Jan 18, 2022, 10:36 PM
ఖమ్మంలోని బ్రాహ్మణ బజార్లో చెట్టు విరిగి పడడంతో ఇద్దరు చిన్నారులు నుజ్జునుజ్జు కాగా, మరో ముగ్గురికి గాయాలవడంతో మంగళవారం విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు ఒకటో తరగతి చదువుతున్న ఆయుష్ (6), ఆరో తరగతి చదువుతున్న దిగంత్ శెట్టి (12)గా గుర్తించారు. గాయపడిన సాకేత్, అనుమోల్, చరణ్ సాయిలను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీధిలో చిన్నారులు క్రికెట్ ఆడుతుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు కాంపౌండ్లోని చెట్టు వేర్లు బలహీనపడి ఒక్కసారిగా నేలకూలినట్లు స్థానికులు తెలిపారు. మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు డీసీపీ ఘాగ్ ఆలం, ఆర్డీఓ రవీంద్రనాథ్ తదితరులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై స్థానిక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చిట్టిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.