byసూర్య | Tue, Jan 18, 2022, 09:38 PM
తెలంగాణ సెక్రటేరియట్లో కూడా కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా పోలీసులు పై విజృభించగా.. ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం రేపుతోంది. సాధారణ పరిపాలన, విద్య విభాగాల్లో 15 మందికి కరోనా సోకింది. విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాకు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీలోని మూడు పీఎస్లతో పాటు మరో కరోనా సోకింది. కరోనా పాజిటివ్గా మారడంతో GAD ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజా ఐసోలేషన్లో ఉన్నారు. సచివాలయంలో కరోనా కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మిగిలిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు