byసూర్య | Tue, Jan 18, 2022, 09:16 PM
గాంధీనగర్లోని ఎస్బిఐ కాలనీలో గత గురువారం చోరీకి పాల్పడిన ముగ్గురిని గాంధీనగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి తొమ్మిది తులాల బంగారు గొలుసులు, ఒక ద్విచక్రవాహనం, మూడు మొబైల్ ఫోన్లు, రూ.27 వేల నగదు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అరెస్టయిన వారిలో కావటి రాజు (21), పూజారి సాయి కుమార్ గౌడ్ (29), ఇంజమూరి దినేష్ కుమార్ (20) ఉన్నారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు.