byసూర్య | Tue, Jan 18, 2022, 08:00 PM
యాదాద్రిలో మంత్రి ఎర్రబెల్లి పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ యాదగిరి లక్ష్మీనర్సింహస్వామిని మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు మంత్రికి పూర్ణ కుంభం, ఆశీస్సులు, స్వామివారి హారతులతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ పరిపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.