అప్పుల బాధ తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య

byసూర్య | Tue, Jan 18, 2022, 11:11 AM

నల్గొండ జిల్లా: నకిరేకల్ పట్టణంలో అభిషేక్ చౌహాన్ (22) అనే యువకుడు సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే, అభిషేక్ కుటుంబం మహారాష్ట్రకు చెందినది. అతని తండ్రి హనుమంతు గత 15 ఏళ్లుగా నకిరేకల్‌లో బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తున్నాడు. వీరికి వ్యాపారం నిమిత్తం పట్టణంలో ప్రాథమికంగా రూ.కోటి వరకు బకాయిలున్నట్లు సమాచారం. అప్పుల వారి నుంచి తండ్రి నానా మాటలు చెప్పడంతో తట్టుకోలేక హనుమంతు కుమారుడు అభిషేక్ సైనైడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM