రూ.70 లక్షల విలువైన గంజాయి పట్టివేత.. ఐదుగురు అరెస్ట్

byసూర్య | Mon, Jan 17, 2022, 09:11 PM

అంద్రా - ఒరిస్సా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న రూ.70 లక్షల విలువైన  గంజాయిని పట్టుకున్నట్లు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి తరలిస్తున్న 5 మంది నిందితులను అరెస్ట్ చేశామని, వారి నుంచి రూ.2 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు 3 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


Latest News
 

ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన Fri, Apr 19, 2024, 11:14 AM
చలివేంద్రాన్ని ప్రారంభించిన నాయకులు Fri, Apr 19, 2024, 11:13 AM
ఆ భూమి మొత్తం అటవీ శాఖదే Fri, Apr 19, 2024, 10:55 AM
సైబర్ నేరానికి మోసపోయిన యువకుడు Fri, Apr 19, 2024, 10:14 AM
బీఎస్పీకి కొత్త మనోహర్ రెడ్డి రాజీనామా Fri, Apr 19, 2024, 10:12 AM