byసూర్య | Mon, Jan 17, 2022, 09:11 PM
అంద్రా - ఒరిస్సా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న రూ.70 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్నట్లు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి తరలిస్తున్న 5 మంది నిందితులను అరెస్ట్ చేశామని, వారి నుంచి రూ.2 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు 3 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.