byసూర్య | Mon, Jan 17, 2022, 07:02 PM
తెలంగాణ పోలీస్ శాఖ లో కరోనా కలకలం రేపింది. ఈ థర్డ్ వేవ్ లో ఏకంగా 500 మంది పొలిసు లకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఫ్రంట్లైన్ యోధులుగా పనిచేసిన పోలీసుల కరోనా మొదటి వేవ్ లో 2,000 మందికి కోవిడ్ సోకింది. ఆ తర్వాత 50 మంది పోలీసులు చనిపోయారు. రెండవ వేవ్ సమయంలో సుమారు 700 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు థర్డ్ వేవ్లో 500 మంది పోలీసుల కు కరోనా పాజిటివ్ అని తెలుసుకుని పోలీస్ లు అయోమయంలో పడ్డారు. విధులు నిర్వహించాలంటేనే భయపడుతున్నారు. అయితే తెలంగాణలో పోలీసులకు దాదాపు 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయింది. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పోలీసులకు బూస్టర్ డోసు అందించాలని నిర్ణయించారు.