byసూర్య | Mon, Jan 17, 2022, 06:54 PM
హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక హాస్పిటల్ లో కరోనా కల్లోలం రేపింది .ఏకంగా 57 మంది రోగులు మరియు 9 మంది పారామెడిక్స్ స్టాఫ్ కు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారికి ఆసుపత్రి అధికారులు పరీక్షలు చేస్తున్నారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాశంకర్ మాట్లాడుతూ.. మానసిక వ్యాధిగ్రస్తులు కావడంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని ఒంటరిగా ఉంచుతామని చెప్పారు.