byసూర్య | Mon, Jan 17, 2022, 05:58 PM
కరోనా ఎఫెక్ట్ తో హైదరాబాద్ లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ కరోనా కారణంగా వారం రోజులుగా మార్కెట్ లకు దిగుమతులుతగ్గినట్టు వ్యాపారులు తెలిపారు. ముఖ్యంగా కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది రైతులు హైదరాబాద్ మార్కెట్ల కంటే తమకు సమీపంలోని గ్రామాల్లోనే అమ్ముకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు మార్కెట్లలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. టమాటా గత కొన్ని రోజుల క్రితం వరకూ అగ్గి మండినా ప్రస్తుతం కిలో 30 నుంచి 40రూపాయలు పలుకుతోంది. అలాగే చిక్కుడు కాయ కిలో 60 నుంచి 80 రూపాయలు, బిన్నీసు 60 నుంచి 80 రూపాయలు, ఆలుగడ్డ 40 నుంచి 50, గోకర కాయ కిలో 50 నుంచి 60, పచ్చిమిర్చి కిలో 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది.