byసూర్య | Mon, Jan 17, 2022, 05:51 PM
తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా పంజా విసిరింది. 120 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. డాక్టర్లు, హౌస్ సర్జన్స్, ఎంబీబీఎస్ విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఇంకా ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో 57 మంది పేషెంట్లు, 9 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. లక్షణాలున్న వారికి ఆస్పత్రి అధికారులు టెస్టులు చేయిస్తున్నారు. మానసిక రోగులు కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉమాశంకర్ తెలిపారు.