byసూర్య | Mon, Jan 17, 2022, 03:57 PM
గంజాయి సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను శంషాబాద్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన సోమవారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద చోటుచేసుకుంది. పట్టుబడిన గంజాయి విలువ రూ. 70 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు. రూ. 2. 10 లక్షల నగదు, 3 కార్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.