byసూర్య | Mon, Jan 17, 2022, 03:19 PM
సంక్రాతి పండుగ సెలవులకు ఊరికి వెళ్లిన పట్టణవాసులు ఆదివారంతో సెలవులు ముగియడంతో సోమవారం హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. విద్యాసంస్థలకు సెలవులు పెరగడంతో రద్దీ కొంత తగ్గింది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలు వెళ్తున్నాయి. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా జీఎంఆర్ సిబ్బంది హైదరాబాద్ వైపు 9 కౌంటర్లు ఏర్పాటు చేయగా 97 శాతం వాహనాలు టోల్ గేట్ వద్ద నుంచి నిమిషాల వ్యవధిలోనే వేగంగా వెళ్లిపోయాయి.