byసూర్య | Mon, Jan 17, 2022, 02:28 PM
ఆదిలాబాద్ : కనుమ పండగ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 108 మంది బ్రాహ్మణ దంపతులకు పాదపూజ చేశారు.శాస్త్రినగర్లోని తమ నివాసంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విజయలక్ష్మి దంపతులు.. దంపతీ పూజ నిర్వహించి బ్రాహ్మణ పండితులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులకు ప్రజలందరికి సుఖసంతోషాలు కలిగించే శక్తి సామర్థాలు ప్రసాదించాలని, వారికి ఆయురారోగ్యాలు కలగాలని వేద పండితులు దీవించారు. సీయం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో గడపాలని ఆశీర్వదించారు. ఈ పూజలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.