byసూర్య | Mon, Jan 17, 2022, 02:21 PM
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద ఐదుగురు గంజాయి స్మగ్లర్లు పెద్ద ఎత్తున గంజాయితో పట్టుబడ్డారు.పోలీసులు వారి వద్ద నుంచి 70 లక్షల రూపాయల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మూడు కార్లు, మొబైల్ ఫోన్లు, రూ.2.10లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ వద్ద గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. శంషాబాద్ సీఐ వెంకట్ రెడ్డి, కొత్తూరు సీఐ శ్రీధర్ భూపాల్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించి స్మగ్లర్లను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. నగరంలో స్మగ్లింగ్కి ఏమాత్రం తావు ఇవ్వమని చెప్పారు.