byసూర్య | Mon, Jan 17, 2022, 02:15 PM
ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్న తెరాస ప్రభుత్వానికి ఉద్యోగులు తోడ్పాటు అందించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులతో పాటు ప్రజలు ఐక్యంగా పనిచేయాలని ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం రూపొందించిన డైరీని వినోద్ కుమార్ ఆవిష్కరించారు. కవులు, కళాకారులు, సంస్కృతికి సంబంధించిన అన్ని అంశాలను డైరీలో పొందుపరిచామని తెలంగాణ ఉద్యోగుల సంఘం వెల్లడించింది.