byసూర్య | Mon, Jan 17, 2022, 01:55 PM
యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోన థర్డ్ వేవ్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే పోలీసులకు కరోన పాజిటివ్ గా నిర్దారణ అయింది.ఒకే వారంలో ఏసీపీ, సీఐ , కానిస్టేబుల్ సిబ్బంది తో సహా మొత్తం 12 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం పోలీస్ సిబ్బంది మొత్తం హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.స్టేషన్ లో సుమారు 70 మంది పోలీస్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక్క సారిగా కరోనా కేసులు పెరుగుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.