byసూర్య | Mon, Jan 17, 2022, 12:44 PM
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. రాత్రిపూట కర్ఫ్యూను ప్లాన్ చేశారు. విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు పొడిగించింది. అలాగే థియేటర్లు, మాల్స్ ఇతర జనావాస ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.