byసూర్య | Mon, Jan 17, 2022, 12:21 PM
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. సిర్నాపల్లికి చెందిన పీఎంపీ శ్రీనివాస్ తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై ఇందల్వాయికి వచ్చి శనివారం తిరిగి వచ్చాడు. టోల్ ప్లాజా వైపు వెళ్తున్న వీరి ద్విచక్రవాహనం వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొని రోడ్డుపై పడింది. గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.