byసూర్య | Mon, Jan 17, 2022, 11:32 AM
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2022-23) రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నేటి నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం. బీఆర్కే భవన్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శాఖల వారీగా కార్యదర్శులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదాయం, వ్యయం, మిగులు, అవసరాలు తదితర అంశాలతో పాటు కొత్త ప్రతిపాదనలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. ఈ సమావేశాల అనంతరం ఆర్థిక శాఖ తుది నివేదికను రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు అందజేస్తుంది.