హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌

byసూర్య | Mon, Jan 17, 2022, 10:56 AM

హైదరాబాద్‌ వాసులకు బిగ్‌ షాక్‌ తగిలింది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోని పలు ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది. నేడు జంట నగరాల్లో పలు రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండవని అధికారులు అధికారికంగా ప్రకటించింది రైల్వే శాఖ.అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో కొన్ని రూట్లలో ట్రాక్ మరమ్మతులు కొనసాగుతున్నాయని… ట్రాక్ మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలోనే కొన్ని రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీస్ లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే శాఖ స్పష్టం చేసింది.ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఎంఎంటీఎస్ సర్వీస్ పై రద్దు ఉంటుందని తెలిపారు. తిరిగి మంగళ వారం నుంచి అన్ని రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీస్ లు మళ్లీ పునః ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఇవాళ ఒక్కరోజే జంట నగరాల్లో నడుస్తున్న మొత్తం 79 ఎంఎంటీఎస్ సర్వీస్ లలో 36 రైళ్లను రద్దు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అలాగే సంక్రాంతి సెలవుల నేపథ్యంలో నగరంలో ఎంఎంటీఎస్ లలో రద్దీ తగ్గడంతో ట్రాక్ మరమ్మతులు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సమయంలో ఎంఎంటీఎస్ సర్వీస్ లు రద్దు చేసినా.. ప్రభావం ఎక్కువ ఉండదని తెలిపారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM