ఒకే మండలంలో మూడు చోట్ల ప్రమాదాలు

byసూర్య | Sun, Jan 16, 2022, 09:00 PM

ఆ మండలంలో వాహనాలు ఢీకొన్నాయి...కొన్ని ప్రాణాలు గాలిలో కలిశాయి. ఒకే ప్రాంతంలో కొన్ని గంటల వ్యవధిలో జరిగిన మూడు ప్రమాదాలు ఐదుగురు ప్రాణాలను బలి తీసుకున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం ధర్మోజీగూడెంలో ఆదివారం ఉదయం ఓ కారు, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌ జవహర్‌నగర్‌కు చెందిన చందు(35), ఆసిఫ్‌నగర్‌కు చెందిన సాయి పృథ్వీరాజ్‌(23) అక్కడికక్కడే మృతిచెందారు. బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. చౌటుప్పల్ మండలంలోని లింగోజిగూడెం వద్ద శనివారం రాత్రి బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకులను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రి ప్రాణాలు కోల్పోగా.. కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన రెండు తర్వాత అక్కడకు సమీపంలోనే మరో ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతులను చిట్యాల మండంలం వెలిమినేడులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులుగా గుర్తించారు. చౌటుప్పల్‌ ప్రాంతంలో గంటల వ్యవధిలో జరిగిన రోడ్డుప్రమాదాలు స్థానికులను, వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.


Latest News
 

పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ సిద్ధం Fri, Apr 19, 2024, 08:58 PM
చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM