byసూర్య | Sun, Jan 16, 2022, 08:59 PM
జగిత్యాల మల్యాల మండలం నూకపల్లిలో ఆదివారం గోడ కూలి గౌతమ్ కీర్తన్ అనే వలస కూలీ మృతి చెందాడు. ఛత్తీస్గఢ్కు చెందిన కీర్తన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులో కూలీగా పనిచేస్తుండగా గోడ కూలిపోవడంతో తలకు బలమైన గాయమైంది. అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.