byసూర్య | Sun, Jan 16, 2022, 08:46 PM
తెలంగాణలో గత 24 గంటల్లో 55,883 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 2,047 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,174 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 178 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి, రంగారెడ్డి జిల్లాలో 140 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 2,013 మంది కరోనా నుంచి కోలుకున్నారు , ముగ్గురు మృతి చెందారు.
.