byసూర్య | Sun, Jan 16, 2022, 05:28 PM
సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ బస్సులను ఎంచుకుని తమ స్వస్థలాల నుంచి సురక్షితంగా తిరిగి రావచ్చని సూచిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అలాగే ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు అని దీంతో సొంత గ్రామాలకు వెళ్లిన వారి కోసం 3,500 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఆఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.