byసూర్య | Sun, Jan 16, 2022, 04:41 PM
రేపటినుంచి ఈ నెల 30వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తాం అని ఉస్మానియా యూనివర్సిటి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల పరిధిలో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశారు. ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించడంతో పరీక్షలు రీషెడ్యూల్ విడుదల చేశారు. ఎల్లుండి నుంచి పలు యూనివర్సిటీలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు వాయిదా వేశారు. మరోవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించినట్లు వెల్లడించింది. అధికారికంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ప్రకటించారు.