byసూర్య | Sun, Jan 16, 2022, 04:30 PM
కనుమ సందర్భంగా చికెన్ ధర ను వ్యాపారాలు అమాంతం పెంచేశారు. రిటైల్ షాపుల్లో కిలో చికెన్ ధర 200 నుంచి 220 రూపాయలకు అమ్మకాలు చేశారు. భోగి, సంక్రాంతి పండగలు శుక్ర, శనివారాల్లో రావడంతో చాలా మంది నాన్ వెజ్ కు దూరంగానే ఉన్నారు. సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండగ రోజున అత్యధిక శాతం నాన్ వెజ్ ప్రియులు చికెన్ కోసం ఎగబడతారు. ఆదివారం కనుమ రోజున ఉదయం 6గంటల నుంచే చికెన్ షాపులు కిటకిటలాడారు. అయితే చాలా మంది వినియోగ దారులు చికెన్ ధర చూసి షాక్ అయ్యారు. కేవలం శనివారం కిలో చికెన్ 220 రూపాయలు పలుకగా ఆదివారం నాటికి కిలో 250 రూపాయలకు పెంచేశారు. దీంతో చాలా మంది కొనుగోలు ఇదేం ఖర్మరా బాబూ అంటూ గొనుక్కుంటూనే చికెన్ కొనుగోలు చేశారు.