byసూర్య | Sat, Jan 15, 2022, 02:22 PM
ముందుగా భారత్లో టెస్లా వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తున్నందుకు మస్క్కు ధన్యవాదాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఓ ట్వీట్ కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. భారత ప్రభుత్వంతో ఎదురువుతోన్న సవాళ్ల కారణంగానే ఇండియాలోకి టెస్లా రాక ఆలస్యమవుతోందని ఆయన విమర్శించారు. దీనిపై పలువురు ఇప్పటికే మండిపడుతూ ట్వీట్లు చేశారు. తాజాగా, తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ కూడా ఈ ట్వీట్ పై స్పందించారు. ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. ముందుగా భారత్లో టెస్లా వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తున్నందుకు మస్క్కు ధన్యవాదాలని కేటీఆర్ పేర్కొన్నారు. భారత్/తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయన్నని ఆయన చెప్పారు. ప్రధానంగా పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరత విషయాల్లో తెలంగాణ ఛాంపియన్గా నిలిచిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఉందని చెప్పారు.