byసూర్య | Fri, Jan 14, 2022, 09:25 PM
తెలంగాణలో గత 24 గంటల్లో 68,525 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 2,398 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,233 కొత్త కరోనా కేసులు నమోదుయ్యాయి, రంగారెడ్డి జిల్లాలో192 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 191 కరోనా కేసులు నమోదుయ్యాయి. అదే సమయంలో 1,181 మంది కరోనా నుంచి కోలుకున్నారు, ముగ్గురు మృతి చెందారు.