byసూర్య | Fri, Jan 14, 2022, 09:20 PM
నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. రూ.56 కోట్ల అంచనా వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నారు.పనుల పురోగతిని రోడ్లు భవనాల శాఖ అధికారులు, సంబంధిత ఏజెన్సీని ఇంద్రకరణ్ అడిగి తెలుసుకున్నారు. ప్రజల సౌకర్యార్థం ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. మే నెలలో కలెక్టరేట్ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ నిర్మల్ జిల్లా విభిన్న రంగాల్లో దూసుకుపోతోందన్నారు. జిల్లా కేంద్రాల సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. నిర్మల్ పట్టణాన్ని ఉత్తర తెలంగాణలోనే మోడల్ సివిక్ బాడీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాకు మెడికల్, నర్సింగ్ కళాశాల మంజూరు చేయనున్నట్లు తెలియజేశారు.