byసూర్య | Fri, Jan 14, 2022, 01:41 PM
తెలంగాణ ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ గడువును పొడిగించింది. ఈ నెల 20వ తేదీలోగా పంపిణీ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వీ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి రేషన్ పంపిణీ ప్రతినెలా 1వ తేదీన ప్రారంభమై 15వ తేదీతో ముగుస్తుంది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఈ నెల 5వ తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించారు. ఈ నెల 20వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.