byసూర్య | Fri, Jan 14, 2022, 12:17 PM
తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ తొలి డోస్ను 100 శాతం పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని ఆరోగ్య మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. టీకాలు వేయడంలో తెలంగాణ ఇప్పుడు మరో మైలురాయిని చేరుకుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈరోజు రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ 5 కోట్ల డోస్లు దాటింది. వ్యాక్సిన్ల పంపిణీ 5 కోట్ల డోసులు దాటిందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. టీకాల కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమిస్తున్న వైద్య సిబ్బందితో పాటు పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల సిబ్బందిని మంత్రి హరీశ్ రావు అభినందించారు.