ఫ్రీ వైఫై వాడేవారికి హెచ్చరిక

byసూర్య | Fri, Jan 14, 2022, 12:14 PM

ఇటీవల కాలంలో ఫ్రీ వైఫై సేవలు పెరిగిపోతున్నాయి. బస్టాండ్లు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్ వద్ద కస్టమర్లకు ఆకర్షించేందుకు ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అయితే ఈ ఫ్రీ వైఫైతో మొదటికే ముప్పు వచ్చే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్ల ఉచిత వైఫై వాడే యూజర్ల నుంచి సైబర్ నేరగాళ్లు సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో గత కొద్ది నెలలుగా ఇలాంటి మోసాలు పెరిగిపోయాయని తెలిపారు. ఫ్రీ వైఫై నెట్ వర్క్ లోకి సైబర్ నేరగాళ్లు సాధారణ వినియోగదారుల్లాగానే ప్రవేశిస్తున్నారు. ఆ తర్వాత మ్యాన్ ఇన్ మిడల్ అటాక్ పద్దతిలో దాడి చేస్తూ ఫోన్ నెంబర్లు, మెయిల్ అడ్రస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, సోషల్ మీడియా ఖాతా వివరాలు, పాస్ వర్డ్ లు సేకరిస్తున్నారని తెలిపారు. వాటి సాయంతో బ్యాంకులో ఉన్న నగదును బదిలీ చేసుకుంటున్నారని, మరికొన్ని సందర్భాల్లో సైబర్ నేరగాళ్లకు భయపడి బాధితులు నగదు బదిలీ చేస్తున్నారని పోలీసులు అలర్ట్ చేశారు.

Latest News
 

బండి సంజయ్‌ ఆస్తుల లెక్క ఇదే.. కిషన్ రెడ్డి ఇప్పటికీ ఆ కారే వాడుతున్నారు Sat, Apr 20, 2024, 09:31 PM
తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు.. నేటి నుంచి మూడ్రోజులు వర్షాలు Sat, Apr 20, 2024, 09:26 PM
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆస్తులెన్నో తెలుసా..? అదే ఆయన ప్రధాన ఆదాయ వనరు Sat, Apr 20, 2024, 09:19 PM
కుమారుడిపై కేసు భయం.. తల్లి సూసైడ్, ఎంత విషాదం Sat, Apr 20, 2024, 09:10 PM
మామిడి చెట్టెక్కి మరీ,,,,మంత్రి జూపల్లి వెరైటీ ప్రచారం Sat, Apr 20, 2024, 09:06 PM